jagan: జగన్ పై దాడి కేసు: ఆధారాలను ఎన్ఐఏకు ఇచ్చేందుకు తిరస్కరించిన సిట్

  • జగన్ పై దాడి కేసు విచారణలో మరో ట్విస్ట్  
  • ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేసిన ఎన్ఐఏ అధికారులు
  • కోర్టులో కొనసాగుతున్న వాదనలు

వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేసిన కేసును ఎన్ఐఏ విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు ఆధారాలను ఎన్ఐఏకి ఇచ్చేందుకు సిట్ పోలీసులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో, సిట్ పోలీసుల తీరుపై ఎన్ఐఏ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, విజయవాడ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ పై కోర్టులో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.

More Telugu News