Mahesh Babu: కుచేలుడిని వెతుక్కుంటూ వచ్చే కృష్ణుడి కథగా 'మహర్షి'

  • షూటింగు దశలో 'మహర్షి'
  • పొల్లాచ్చిలో చివరి షెడ్యూల్ 
  • స్నేహితుడి పాత్రలో అల్లరి నరేశ్

మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. అశ్వనీదత్ .. దిల్ రాజు .. పీవీపీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాలో మహేశ్ శ్రీమంతుడిగా కనిపించనున్నాడు. ఆయన స్నేహితుడిగా అల్లరి నరేశ్ పాత్ర ఉంటుంది.

పేదవాడైన స్నేహితుడి కోసం తన ఆస్తిపాస్తులను పక్కన పెట్టేసి, విదేశాల నుంచి ఇండియాలోని ఓ మారుమూల పల్లెటూరికి మహేశ్ బాబు వచ్చేస్తాడట. తన స్నేహితుడినే కాదు .. ఆ ఊరునే బాగు చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. పురాణకాలంలో శ్రీమంతుడైన కృష్ణుడిని పేదవాడైన కుచేలుడు వెతుక్కుంటూ వెళితే, ఈ కథలో కుచేలుడు వంటి మిత్రుడిని వెతుక్కుంటూ శ్రీమంతుడైన హీరో వస్తాడన్న మాట. ఈ రోజునే ఈ సినిమా చివరి షెడ్యూల్ పొల్లాచ్చిలో మొదలైంది. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

More Telugu News