Mahesh Babu: మహేశ్ బాబు మేనల్లుడితో దిల్ రాజు సినిమా రద్దు?

  • గల్లా అశోక్ తో చేయాలనుకున్న దిల్ రాజు
  •  స్క్రిప్ట్ సంతృప్తి కరంగా లేకపోవడం వలన ప్రాజెక్టు రద్దు
  • సొంత బ్యానర్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం    

మహేశ్ బాబు మేనల్లుడు .. గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. దిల్ రాజు నిర్మాణంలో శశి దర్శకత్వంలో సినిమాకి ఏర్పాట్లు జరిగిపోయాయి. 'అదే నువ్వు అదే నేను' అనే టైటిల్ తో ఈ సినిమాను దసరాకి లాంచ్ చేశారు. నభా నటేశ్ ను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు కూడా. ఇక రేపో .. మాపో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళుతుందని అనుకుంటూ ఉండగా, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

కథ ఈనాటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా లేకపోవడం వలన .. స్క్రిప్ట్ సంతృప్తి కరంగా రాకపోవడం వలన ఈ సినిమాను ఆపేస్తున్నట్టుగా గల్లా జయదేవ్ కి .. మహేశ్ బాబుకి దిల్ రాజు సమాచారాన్ని అందించినట్టుగా చెప్పుకుంటున్నారు. మరో మంచి ప్రాజెక్టుతో గల్లా అశోక్ ను లాంచ్ చేయడం మంచిదనే అభిప్రాయాన్ని దిల్ రాజు వ్యక్తం చేశాడట. ఈ నేపథ్యంలో సొంత బ్యానర్లో గల్లా అశోక్ ను రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News