paruchuri: త్రివిక్రమ్ కి ఫోన్ చేస్తే ఆ మాట చెప్పాడు: పరుచూరి గోపాలకృష్ణ

  • ఇటీవల త్రివిక్రమ్ కి ఫోన్ చేశాను
  • 'అరవింద సమేత' గురించి ప్రస్తావించాను
  • అభిమానులందరికీ అలా చెప్పాలనుకుంటున్నారట      

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, త్రివిక్రమ్ గురించి ప్రస్తావించారు. "ఇటీవల రచయితల సంఘం పక్షాన కథ ఎలా చెప్పాలి అనే వర్క్ షాప్ నిర్వహించాము. త్రివిక్రమ్ చేతకూడా పాఠం చెప్పించాలనే ఉద్దేశంతో ఆయనని రమ్మని చెప్పడానికి ఫోన్ చేశాను. ఆయనని ఆహ్వానించిన తరువాత .. 'అరవింద సమేత' సినిమా గురించి నేను మాట్లాడాను విన్నారా?' అని అడిగాను.

'నేను ఇక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళుతూ వుంటాను గదా .. అలా బయలుదేరిన దగ్గర నుంచి కార్లో కూర్చుని మీ పాఠాలు వింటూ వెళుతుంటాను గురువుగారూ' అన్నాడు. మీరు లెవెన్త్ అవర్ చెప్పినప్పుడు ఏ హీరో అభిమానులైనా, దానిని గురించి విమర్శించవద్దు. ఇలా కూడా ఈ కథ చెప్పొచ్చు అనేది ఆయన చెబుతున్నారు .. మీరు అర్థం చేసుకోండి' అని నేనే అందరితోనూ చెబుదామని అనుకుంటున్నాను' అన్నారు. నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది' అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News