Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో హత్య... అర్ధరాత్రి కత్తులతో పొడిచి చంపిన దుండగులు

  • చార్మినార్‌ పరిధిలోని మామాజుమ్మా పాఠక్‌ ప్రాంతంలో ఘటన
  • పాతకక్షలే కారణమని అనుమానం
  • ఆరా తీస్తున్న పోలీసులు

హైదరాబాద్‌, పాతబస్తీలోని చార్మినార్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మామాజుమ్మా పాఠక్‌ ప్రాంతంలోని భగ్వాన్‌దేవి ఆసుపత్రి సమీపంలో మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడిచేసి దారుణంగా చంపారు. పాత కక్షలే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు...ఝాన్సీబజార్‌కు చెందిన రవి అలియాస్‌ పీటర్‌ రవి మరో ఇద్దరితో కలిసి శివాలయం సమీపంలో మద్యం తీసుకున్నారు. ఆ సందర్భంలో ముగ్గురి మధ్య వివాదం నెలకొంది. పరస్పరం వాదులాడుకున్నారు. ఆ వివాదం ఘర్షణకు దారితీయడంతో మిగిలిన ఇద్దరు రవిని కత్తులతో విచక్షణా రహితంగా పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.  

More Telugu News