padmanabhaswamy: అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్న మోదీ

  • తిరువనంతపురంలో పద్మనాభస్వామి సేవలో మోదీ
  • ఆలయంలో 'స్వదేశీ దర్శన్ పథకం'ను ప్రారంభించిన పీఎం
  • కార్యక్రమానికి హాజరైన పినరయి విజయన్, శశిథరూర్

ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు కేరళ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కొల్లాంలో రెండు ప్రాజెక్టులను ఈరోజు ఆయన ప్రారంభించారు. అక్కడి నుంచి తిరువనంతపురం చేరుకున్న ప్రధాని... ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ పళనిస్వామి సదాశివం ఉన్నారు. అంతకు ముందు ఆలయంలో 'స్వదేశీ దర్శన్ పథకం'ను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ లు కూడా పాల్గొన్నారు.

More Telugu News