Vijayawada: సబ్ కలెక్టర్, పెనమలూరు ఎమ్మెల్యే మధ్య సమసిన వివాదం

  • ప్రొక్లెయినర్ ని స్వాధీనం చేసుకున్న ఘటన
  • ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చిన ఎమ్మెల్యే
  • రైతుల తరపున జరిమానా చెల్లించిన బోడె ప్రసాద్

విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ల మధ్య వివాదం సమసింది. రైతుల తరపున రూ.లక్ష జరిమానాను బోడె ప్రసాద్ చెల్లించారు. కాగా, వణుకూరులో మట్టి అక్రమ తవ్వకాలపై ప్రొక్లెయినర్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. రైతుల తరపున ఎమ్మెల్యే జరిమానా చెల్లించడంతో ఈ వివాదానికి తెరపడినట్టయింది.

కాగా, ఓ రైతుకు చెందిన ప్రొక్లెయినర్ ను స్వాధీనం చేసుకుని, భారీ జరిమానా విధించిన సంఘటనలో మిషా సింగ్ వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబుకి  బోడె ప్రసాద్ ఈరోజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News