Telangana: మైనర్ యువతిపై 11 మంది దుండగుల గ్యాంగ్ రేప్.. నోరు తెరిస్తే వీడియోలు బయటపెడతామని హెచ్చరిక!

  • కామాటిపురా ప్రాంతంలో ఘటన
  • పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
  • కేసు నమోదు చేసిన అధికారులు

తెలంగాణలోని హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి కామాటిపురాలో ఓ మైనర్ యువతి(16)పై 11 మంది దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బయట ఎవరికైనా చెబితే ఇంటర్నెట్ లో పెడతామని హెచ్చరించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.  ఈ సందర్భంగా బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని దాదాపు 200 మంది బస్తీ వాసులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిందితులను పట్టుకుంటామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News