KCR: 'మహారుద్ర సహిత చండీ మహాయాగం' తలపెట్టిన కేసీఆర్!

  • 21 నుంచి 5 రోజుల పాటు యాగం
  • పాల్గొననున్న 2 వందల మంది రుత్వికులు
  • శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లు

మూడేళ్ల క్రితం అయుత చండీయాగం, గత సంవత్సరం రాజశ్యామల యాగాలను చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ సారి మహారుద్ర సహిత చండీ మహాయాగాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఈ నెల 21 నుంచి 25 వరకూ శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఎరవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో ఈ యాగం జరిపించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

 అయుత చండీయాగం తరహాలోనే ఈ యాగం కూడా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే యాగశాల, రుత్వికులు బస చేసేందుకు తాత్కాలిక ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 5 రోజుల పాటు యాగం జరుగనుండగా, 200 మంది రుత్వికులు పాల్గొంటారు. శృంగేరీ పీఠ పండితులు శశాంక శర్మ, గోపీకృష్ణ శర్మలు యాగంపై ఇప్పటికే కేసీఆర్ తో చర్చించారు. గత నెలలో కేసీఆర్, శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్ధ, విశాఖ పీఠాధిపతి శారదా స్వరూపానదేంద్ర స్వామిలను కలుసుకుని యాగంపై ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ యాగాన్ని చూసేందుకు సందర్శకులను అనుమతించాలా? వద్దా? అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. 

More Telugu News