Telangana: లోక్ సభ ఎన్నికలే టార్గెట్.. ఈ నెల 22న హైదరాబాద్ కు రానున్న అమిత్ షా!

  • పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి
  • పార్లమెంటరీ ఇన్ చార్జీలతో ప్రత్యేక భేటీ
  • పర్యటన వివరాలు తెలిపిన బీజేపీ నేత లక్ష్మణ్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 22న తెలంగాణలోని హైదరాబాద్ లో పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని పటిష్టం చేయడంపై షా దృష్టి సారించనున్నారు. ఈ పర్యటనలో  భాగంగా పార్టీ పార్లమెంటరీ ఇన్ చార్జీలతో పాటు ముఖ్యనేతలతో అమిత్ షా భేటీ అవుతారు. అలాగే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరుపుతారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు.

  • Loading...

More Telugu News