NSE: ఎన్ఎస్ఈ చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా!

  • ఎయిర్సెల్-మాక్సిస్ కేసు
  • చావ్లా సహా ఐదుగురి విచారణకు కేంద్రం అనుమతి
  • ఈ విషయాన్ని ఢిల్లీ కోర్టుకు చెప్పిన సీబీఐ

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా చేశారు. న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అశోక్ చావ్లా సహా ఐదుగురిని విచారించేందుకు కేంద్రం అనుమతి మంజూరు చేసిన విషయాన్ని ఢిల్లీ కోర్టుకు సీబీఐ ఈరోజు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే చావ్లా తన పదవికి రాజీనామా చేశారు.

More Telugu News