Andhra Pradesh: ఎస్పీ ఆఫీసులో పేలిన తుపాకీ.. హడలిపోయిన పోలీస్ అధికారులు!

  • ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన
  • కానిస్టేబుల్ తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదం
  • విచారణకు ఆదేశించిన ఎస్పీ రాజశేఖర్ బాబు

తుపాకీని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా అది పేలడంతో ప్రాణాపాయం నుంచి కానిస్టేబుల్ త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు చోటుచేసుకుంది.

తుపాకి పేలడంతో ఎస్పీ ఆఫీసు ప్రాంగణమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. దీంతో అక్కడకు పరుగుపరుగున చేరుకున్న అధికారులు.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు విచారణకు ఆదేశించారు.

More Telugu News