Aishvarya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మణిరత్నం దర్శకత్వంలో మళ్లీ ఐశ్వర్య 
  • రేపు నాని 'జెర్సీ' టీజర్ విడుదల 
  • వెంకీ, వినాయక్ కాంబో సెట్ అయింది

*  బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్ మళ్లీ మణిరత్నం దర్శకత్వంలో నటించనుంది. ప్రస్తుతం ఓ మల్టీ స్టారర్ చేయడానికి మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నాయిక పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడట.
*  నాని ప్రస్తుతం 'జెర్సీ' చిత్రంలో నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ ను రేపు (శనివారం) విడుదల చేయనున్నారు. నాని క్రికెటర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది.
*  ప్రముఖ హీరో వెంకటేష్, దర్శకుడు వీవీ వినాయక్ ల కాంబినేషన్లో త్వరలో ఓ చిత్రం రానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో 'లక్ష్మి' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News