EBC: ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు టీడీపీ బేషరతుగా మద్దతిస్తోంది: ఎంపీ సుజనా చౌదరి

  • ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్ల బిల్లు మంచిదే
  • ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలి
  • కాపుల రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపినా పట్టించుకోలేదు

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు టీడీపీ బేషరతుగా మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. పార్లమెంటు ఆవరణలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించే నిమిత్తం తీసుకొచ్చిన బిల్లు మంచిదే కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. అయితే, ఈ బిల్లును ఇంత హడావుడిగా తీసుకురావడం చాలా దురదృష్టకరమని విమర్శించారు. ఈ బిల్లుపై విస్తృత చర్చ నిమిత్తం సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. కాపుల రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపినా పట్టించుకోలేదని అన్నారు.

More Telugu News