lakshmiparvathi: అసలు నిజాలు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లోనే కనిపిస్తాయి: లక్ష్మీపార్వతి

  • నన్నెవరూ ఆహ్వానించలేదు 
  • చంద్రబాబు కనుసన్నల్లోనే రూపొందింది 
  • అందరి దృష్టి 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పైనే

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా నిర్మితమైంది. తొలి భాగంగా బాలకృష్ణ నటించిన 'కథానాయకుడు' ఈ రోజునే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కావడంతో, థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. తాజాగా ఈ సినిమాను గురించి లక్ష్మీపార్వతి స్పందించారు.

"ఎన్టీఆర్ బయోపిక్ ను చూడమని నన్నెవరూ ఆహ్వానించలేదు. చంద్రబాబు కనుసన్నలలోనే ఈ బయోపిక్ రూపొందింది. అందువలన ఎన్టీఆర్ కి సంబంధించిన పూర్తి వాస్తవాలు తెరకెక్కే అవకాశం లేదు. ఈ కారణంగానే జనంలోనూ .. నిజమైన అభిమానుల్లోను ఈ సినిమాపై ఎలాంటి ఆసక్తి లేదు. అందరూ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల కోసమే ఎదురుచూస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఎన్టీఆర్ బయోపిక్ ను రూపొందించే ధైర్యం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే వుంది. అసలు నిజాలు అందులోనే ఉంటాయి" అని ఆమె అన్నారు

More Telugu News