Rahul Gandhi: సోనియా, రాహుల్ లకు నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ

  • 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారు. 
  • ఇద్దరూ కలసి జరిమానా సహా రూ. 100 కోట్లు చెల్లించాలి
  • ఉద్దేశపూర్వకంగానే పన్ను ఎగవేశారు
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఉద్దేశ పూర్వకంగా పన్ను ఎగవేశారని నోటీసులో పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను వీరిద్దరూ రూ. 300 కోట్ల ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారని తెలిపింది. ఆ సంవత్సరం రాహుల్ ఆదాయం రూ. 155 కోట్లు అయినప్పటికీ... రూ. 68 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపించి, ఆ మొత్తానికే పన్ను చెల్లించారని పేర్కొంది. రూ. 155.41 కోట్లకు సంబంధించి సోనియాగాంధీ... రూ. 155 కోట్లకు సంబంధించి రాహుల్ గాంధీలు జరిమానాతో కలిపి రూ. 100 కోట్లు చెల్లించాలని సూచించింది.  
Rahul Gandhi
Sonia Gandhi
it
notice
income tax

More Telugu News