Prakasam District: ప్రకాశం జిల్లాలో భారీ కాగితపు పరిశ్రమ.. నేడు చంద్రబాబు శంకుస్థాపన

  • రామాయపట్నం సమీపంలో పరిశ్రమ ఏర్పాటు
  • రూ. 24 వేల కోట్ల పెట్టుబడి
  • స్థాపించనున్న ఇండోనేషియా కంపెనీ

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పరిశ్రమ వస్తోంది. రామాయపట్నం సమీపంలో ఆంధ్రా పేపర్ ఎక్స్‌లెన్స్ (ఏపీఈ) పేరుతో ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్ప్ అండ్ పేపర్ మిల్స్ (ఏపీపీ)  ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. రెండు దశల్లో మొత్తం రూ. 24 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ కంపెనీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేయనున్నారు. దేశానికి ఇప్పటి వరకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (ఎఫ్‌డీఐ) ఇదే అత్యధికం కావడం గమనార్హం.

ఈ పరిశ్రమ ద్వారా 15 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని 60 వేల మంది సుబాబుల్, యూకలిప్టస్ సాగు రైతులకు ప్రయోజనం కలుగుతుంది. కాగా, నేడు రామాయపట్నం పోర్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

More Telugu News