Rana Daggubati: మొన్నే నేనూ.. రానా చర్చించుకున్నాం.. అంతలోనే మోదీ సర్ నిర్ణయం తీసుకున్నారు: హీరో నిఖిల్

  • రానా షోలో మాట్లాడుకున్నాం
  • అద్భుతమైన పనితీరును కనబరిచారు
  • జాతి వివక్షకు నో చెప్పండి

అగ్రవర్ణ పేదలకు ఆర్థిక స్తోమత ప్రాతిపదికగా విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఈ విషయమై సినీ కథానాయకుడు నిఖిల్ స్పందిస్తూ మోదీ నిర్ణయాన్ని అభినందించాడు.

ఇదిలావుంచితే, అయితే ఇటీవల రానా హోస్ట్‌గా నిర్వహిస్తున్న ‘నెం.1 యారీ’ షోలో నిఖిల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రానా, తాను అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై చర్చించుకున్నట్టు నిఖిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

‘కొన్ని వారాల క్రితం రానా వ్యాఖ్యాతగా వ్యవహరించే షోలో మేం ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కులం, మతం, జాతి గురించి పట్టించుకోకుండా మోదీ సర్‌ దీనిని నిజం చేసి అద్భుతమైన పనితీరును కనబరిచారు. జాతి వివక్షకు నో చెప్పండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

More Telugu News