mammootty: 'యాత్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా జగన్

  • రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి 
  • విజయమ్మగా ఆశ్రిత వేముగంటి 
  • ఫిబ్రవరి 8న సినిమా విడుదల  

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా నిర్మితమైంది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.

ఈ వేడుకకి వైఎస్ జగన్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ తో పాటు ఆయన తల్లి .. భార్య ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టుగా సమాచారం. గతంలో వైఎస్ చేపట్టిన పాదయాత్ర .. ప్రజల మనసులకు ఆయన మరింత దగ్గరైన సంఘటనలు .. ఆనాటి రాజకీయాలపై ఆయన పాదయాత్ర చూపిన ప్రభావం ఈ బయోపిక్ లో ఆవిష్కరించనున్నారు. వైఎస్ గా మమ్ముట్టి .. విజయమ్మగా ఆశ్రిత వేముగంటి నటించిన ఈ బయోపిక్ కి అంచలంచెలుగా అంచనాలు పెరుగుతుండటం విశేషం.

More Telugu News