sarita: 162 మంది హీరోయిన్స్ లో బాలచందర్ గారు నన్ను ఎంపిక చేశారు: సీనియర్ హీరోయిన్ సరిత

  • గణేశ్ పాత్రో గారు నన్ను చూశారు 
  • కమలహాసన్ జోడీ అనే సరికి ఓకే చెప్పాను
  • ఆడిషన్స్ లో నన్ను ఓకే చేశారు    

కమలహాసన్ .. సరిత జంటగా బాలచందర్ తెరకెక్కించిన 'మరో చరిత్ర' .. మరెన్నో ప్రేమకథా చిత్రాలకు ఆశ్రయాన్ని కల్పించింది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న సరిత ఆ విశేషాలను గురించి ప్రస్తావించారు. "రచయిత గణేశ్ పాత్రో మా నాన్నగారికి మంచి స్నేహితుడు. ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి, 'మీ అమ్మాయి సినిమాల్లో నటిస్తుందా?' అని మా నాన్నగారిని అడిగారట.

మా నాన్న నన్ను పిలిచి 'సినిమాల్లో చేస్తావా?' అని అడిగారు. 'నేను చేయను" అనేసి లోపలికి వెళ్లిపోయాను. అప్పుడు ఆయన మా నాన్నగారితో 'కమలహాసన్ సినిమాలో హీరోయిన్ కావాలి .. ఈ అవకాశం మళ్లీ రాదు' అన్నారు. కమలహాసన్ అనగానే నేను ఓకే చెప్పేశాను. మరుసటి రోజు ఆఫీసుకి వెళ్లాను. ఒక పాట పాడమంటే పాడాను .. డైలాగ్ చెప్పమంటే చెప్పాను. దాంతో ఆ సినిమాకి నన్ను వాళ్లు ఓకే చేసేశారు. అప్పటికి 162 మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారట. వాళ్లను దాటుకుని అవకాశం నాకు రావడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News