saipallavi: సినిమా ఆడకపోవడంతో పారితోషికాన్ని తిరిగిచ్చేసిన సాయిపల్లవి?

  • కథకి మాత్రమే ప్రాముఖ్యతను ఇచ్చే సాయిపల్లవి
  • పాత్రలో ఇమిడిపోవడం ఆమె ప్రత్యేకత
  • పారితోషికం విషయంలో పట్టింపు లేదు  

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. ఏ పాత్రను అంగీకరించినా ఆ పాత్రలో ఎంతో సహజంగా ఒదిగిపోవడం .. సాయిపల్లవి తప్ప మరొకరు ఆ పాత్రను చేయలేరని అనిపించుకోవడం ఆమె ప్రత్యేకత. కథను తప్ప ఆమె తన పారితోషికానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వదు. పాత్రను గురించి తప్ప దాని నిడివి గురించి ఆలోచించదు. అలాంటి సాయిపల్లవి మరో విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసింది.

ఆమె తాజా చిత్రంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు 'పడి పడి లేచె మనసు' వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేక పోయింది. దాంతో సాయిపల్లవి ఈ సినిమాకి గాను తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసిందట. సాధారణంగా తమ సినిమాలు ఆడనప్పుడు స్టార్ హీరోలు కొంతమంది ఇలా చేస్తుంటారు. అలా సాయిపల్లవి వ్యవహరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

More Telugu News