Crime News: బైక్ ను ఢీకొన్న కారు... ఫ్లయ్ ఓవర్ పై నుంచి కిందపడిన యువతి దుర్మరణం!

  • న్యూఢిల్లీ బారాపుల్లా ఫ్లయ్ ఓవర్ పై ఘటన
  • పెళ్లికి వెళ్లి వస్తున్న యువ జంట
  • కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

న్యూఢిల్లీలోని ఓ ఫ్లయ్ ఓవర్ పై బైక్ మీద వెళుతున్న జంటను ఓ కారు ఢీకొనగా, యువతి (30) దుర్మరణం చెందింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తన భర్తతో కలిసి త్రిలోకపురి ప్రాంతంలో జరిగిన ఓ వివాహానికి వెళ్లిన యువతి, తిరుగు ప్రయాణంలో బారాపులా ఫ్లయ్ ఓవర్ పైకి చేరుకున్న సమయంలో ప్రమాదం జరిగింది.

పదవీ విరమణ చేసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నడుపుతున్న ఓ కారు ఢీకొనడంతో ఆ వేగానికి బైక్ పై కూర్చుని ఉన్న యువతి, ఫ్లయ్ ఓవర్ పై నుంచి కిందపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో యువతి భర్త తల, కాళ్లకు గాయాలు అయ్యాయి. కేసును నమోదు చేసుకున్నామని, కారును నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేశామని ఢిల్లీ సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు.

More Telugu News