yatra: మాట ఇచ్చే ముందు ఆలోచిస్తా.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది?: అదరగొడుతున్న 'యాత్ర' ట్రైలర్

  • కాసేపటి క్రితం ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
  • వైయస్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సన్నివేశాలు, డైలాగులు
  • ఫిబ్రవరి 8న విడుదల కానున్న 'యాత్ర'

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాసేపటి క్రితం ఈ చిత్రం ట్రైలర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్న సన్నివేశాలు, డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి.

ఈ సమాజంలో అన్నింటికన్నా పెద్ద జబ్బు పేదరికం అనే డైలాగ్ జనాల మనసులను తాకేలా ఉంది. ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను మమ్ముట్టి పోషించగా జగపతిబాబు, సుహాసిని, సుధీర్ బాబు, రావు రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు.

  • Loading...

More Telugu News