yash: తెలుగు రాష్ట్రాల్లో లాభాలు తెచ్చిపెట్టిన 'కేజీఎఫ్'

  • కన్నడ సినిమాగా రూపొందిన 'కేజీఎఫ్'
  • తెలుగు .. హిందీ భాషల్లోను రిలీజ్ 
  • తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో 10.29 కోట్ల షేర్    

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ కథానాయకుడిగా తెరకెక్కిన 'కేజీఎఫ్', కన్నడతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు హిందీలోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఆ స్థాయిలో దూకుడు చూపకపోయినా, తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టింది.

ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను వారాహి చలన చిత్రం వారు 5 కోట్లకి కొనుగోలు చేసి విడుదల చేశారు. తొలివారంలో 5 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, 17 రోజులకి గాను 10.29 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అలా ఈ సినిమా వారాహి చలనచిత్రం వారికి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మధ్య పెద్దగా లాభాలు రాని సినిమాలతో ఇబ్బంది పడుతోన్న వారాహి వారికి ఈ సినిమా ఊరట నిచ్చిందని చెప్పుకుంటున్నారు.

  • Loading...

More Telugu News