Andhra Pradesh: రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీకి మొండిచెయ్యి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు!

  • పోలవరం కాంక్రీట్ పనుల్లో సరికొత్త రికార్డు
  • కార్మికులు, అధికారులకు సీఎం అభినందనలు
  • ఏపీ అభివృద్ధిని చూసి మోదీకి అక్కసు కలుగుతోంది

పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనుల్లో రికార్డు సృష్టించిన అధికారులు, కార్మికులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీకి దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని అవార్డులు వచ్చాయని అన్నారు. అందుకే ప్రధాని మోదీకి అసూయ, అక్కసు కలుగుతోందని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యల్లో నైరాశ్యం కనిపిస్తోందన్నారు. అమరావతిలో ఈరోజు కలెక్టర్లు, అధికారులతో ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంపై సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోదీ హుందాతనం లేకుండా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీకి శకటం లేకుండా చేయడం వివక్షేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News