India: సిడ్నీ టెస్ట్ డ్రా... భారత్ ఖాతాలో సిరీస్.. కోహ్లీ సేన రికార్డ్!

  • డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్
  • టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
  • ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా పుజారా

సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ ఉదయం నుంచి వర్షం పడుతూ ఉండటంతో లంచ్ విరామం వరకూ అంపైర్లు వేచి చూశారు. అప్పటికీ వర్షం పడుతూనే ఉండటంతో ఈ మ్యాచ్ లో ఫలితం వచ్చే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించిన అంపైర్లు, మ్యాచ్ ని డ్రాగా ముగిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టెస్ట్ సిరీస్ 2-1 తేడాతో భారత్ వశమైంది.

అంతేకాదు, ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ ను నెగ్గిన ఘనత కోహ్లీ సేన పరమైంది. క్రికెట్ దిగ్గజాలుగా పేరున్న కపిల్ దేవ్, గవాస్కర్, అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఆటగాళ్లు ఆసీస్ లో పర్యటించినా, ఎన్నడూ సిరీస్ గెలవలేదన్న సంగతి తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అద్భుతంగా రాణించిన ఛటేశ్వర్ పుజారాకు లభించింది.

More Telugu News