Odisha: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఐదుగురు రికార్డింగ్ డ్యాన్సర్ల మృతి!

  • ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో ఘటన
  • మృతులంతా రాయల్ డ్యాన్స్ గ్రూప్ సభ్యులే
  • ప్రోగ్రామ్ ఇచ్చి వస్తుండగా ప్రమాదం

ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు రికార్డింగ్ డ్యాన్సర్లను బలిగొంది. కేంద్రపడ జిల్లా డెరాస్ వద్ద ఈ ప్రమాదం జరుగగా, డ్యాన్సర్లు ప్రయాణిస్తున్న కారును (ఓడీ 33 ఎస్ 8154) గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదం సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా, ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులంతా రాయల్ డ్యాన్స్ గ్రూప్ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఓ గ్రామంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించి వస్తుండగా, వీరి వాహనం ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News