దేశంలో రాజకీయం, ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోతున్నాయి: ‘లోక్ సత్తా’ జేపీ
- ప్రభుత్వ పని తీరు ఏమంత ఆశాజనకంగా లేదు
- పార్టీలకు ప్రజాప్రయోజనాలు పట్టడం లేదు
- ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విపరీతంగా పెరిగింది
ప్రభుత్వ ఉద్యోగులను చూస్తుంటే ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విపరీతంగా పెరిగిందని, లంచం లేకుండా ఒక్కపనీ అవ్వడం లేదని జేపీ విమర్శించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పౌరసేవల చట్టం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే రాజకీయం కావాలని ఆకాంక్షించారు. నిజమైన ఫెడరలిజం దేశంలో రావాలని, ఫ్యూడల్ వ్యవస్థ నాశనం కావాలని కోరారు.