janasena: జనసేన బలమంతా కోస్తా జిల్లాల్లోనే ఉందని కొందరంటున్నారు.. అది నిజం కాదని నా కవాతు నిరూపించింది!: పవన్ కల్యాణ్

  • నన్ను ఓ ప్రాంతానికే పరిమితం చేసే యత్నం తగదు
  • బ్రిటిష్ హయాంలోనే అత్యధిక పనులు చెల్లించిన ప్రాంతమిది
  • రాజకీయవెనుకబాటు తనం వల్లే ‘అనంత’ కరవు

అనంతపురంలో ఇటీవల నిర్వహించిన ‘జనసేన’ కవాతు చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జనసేన బలమంతా కోస్తా జిల్లాల్లోనే ఉందని కొందరు అంటున్నారని, తనను ఓ ప్రాంతానికే పరిమితం చేసేందుకు యత్నిస్తున్నారని, అది నిజం కాదని తన కవాతు రుజువు చేసిందని అన్నారు.

ఈ సందర్భంగా అనంతపురం గురించి ప్రస్తావిస్తూ.. బ్రిటిష్ హయాంలోనే అత్యధిక పనులు చెల్లించిన ప్రాంతం అనంతపురం జిల్లా అని అన్నారు. ఇక్కడి కరవు సమస్యకు ఒక్క రోజులో పరిష్కారం చూపలేమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయవెనుకబాటు తనం వల్లే ఈ జిల్లాలో కరవుకి పరిష్కారం లభించలేదని విమర్శించారు. నీటి సమస్య వుండే ఇజ్రాయిల్ దేశంలో పుష్కలంగా పంటలు పండిస్తున్నారని, అనంతపురంలో మనం ఆ ప్రయోగం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు. పాలకులు సంకల్పించకపోవడం వల్లే దీనిపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. 

More Telugu News