cow slatters: ఉత్తరప్రదేశ్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు గోహంతకులను కాల్చి చంపిన పోలీసులు

  • ఆవులను చంపి, మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా
  • గ్రామంలోకి వచ్చిన పోలీసులపై కాల్పులు
  • పోలీసుల కాల్పుల్లో ఇద్దరి మృతి.. మరో ఇద్దరు పరార్

గోహంతకులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ సమీపంలో ఉన్న శికర్పూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆవులను చంపి, వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులపై వారు కాల్పులు ప్రారంభించారు. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గోహంతకులు మరణించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మరో ఇద్దరు గోహంతకులు పారిపోయారని చెప్పారు. ఘటనా స్థలంలో వంద కిలోల ఆవు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

More Telugu News