Telugudesam: టీడీపీ ఎంపీలకు ములాయం సింగ్ మద్దతు.. అనుకూలంగా నినాదాలు!

  • పార్లమెంటు ప్రాంగణంలో కేంద్రానికి వ్యతిరేకంగా టీడీపీ ఎంపీల ఆందోళన
  • వారి వద్దకు వచ్చిన ములాయం సింగ్
  • కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, 14 మంది టీడీపీ ఎంపీలను సభ నుంచి నిన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. దీంతో, ఈరోజు వారంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్లకార్డులు పట్టుకుని, ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారి వద్దకు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ వచ్చారు. ఎంపీల ఆందోళనకు తన మద్దతు ప్రకటించారు. వారితో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

More Telugu News