Xiaomi Redmi Pro 2: షియోమీ నుండి 48 మెగాపిక్సల్ కెమెరాతో నూతన స్మార్ట్ ఫోన్!

  • ఈ నెల 10న విడుదల కానున్న 'రెడ్ మీ  ప్రో 2'
  • చైనాలో విడుదల చేయనున్నట్లు వెల్లడి
  • ప్రకటించిన షియోమీ ప్రెసిడెంట్

చైనా మొబైల్ సంస్థ షియోమీ 48 మెగాపిక్సల్ కెమెరాతో నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనుంది. ఈ నెల 10న 'రెడ్ మీ ప్రో 2' పేరిట చైనాలో లాంచ్ చేయనున్నట్లు షియోమీ ప్రెసిడెంట్ లిన్ బిన్ తెలిపారు. ఈ ఫోన్ పూర్తి ఫీచర్లని సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ ఫోన్ లో వర్టికల్ కెమెరాతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్, వెనక భాగంలో రెండు కెమెరాలు ఉండనున్నట్లు లిన్ బిన్ షేర్ చేసిన ఫోటోని బట్టి తెలుస్తోంది. కాగా, ఈ ఫోన్ పూర్తి వివరాలు విడుదల రోజే తెలియయనున్నాయి.

More Telugu News