కేవలం రూ.1,182 కోట్లు ఇస్తే.. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారమైపోతుంది!: వైసీపీ నేత పార్థసారధి
- హాయ్ ల్యాండ్ అగ్రిగోల్డ్ సంస్థదే
- గోదావరి పుష్కరాలకు రూ.4,500 కోట్లు వెచ్చించారు
- విజయవాడలో మీడియాతో మాట్లాడిన నేత
అగ్రిగోల్డ్ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రమంతటా కలెక్టరేట్ల ముందు వైసీపీ నేడు ఆందోళనకు దిగుతుందని ప్రకటించారు. గోదావరి పుష్కరాల కోసం చంద్రబాబు రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టి, 40 మందిని చంపారని ఆరోపించారు. కేవలం రూ.1,182 కోట్లు ఇస్తే దాదాపు 60 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఆస్తులను కోర్టు దృష్టికి తీసుకెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకూ వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.