epfo: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు పెంపు?

  • ప్రస్తుతం వున్న 8.55 శాతం వడ్డీ రేటును పెంచే యోచన  
  • అంతర్గత సమీక్షా సమావేశంలో నిర్ణయం 
  • నెలాఖరుకి నిర్ణయం ప్రకటన

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేంద్రం వివిధ వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ ఓ) ఖాతాదారులకు లబ్ధి చేకూర్చే నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం వున్న 8.55 శాతం ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును పెంచాలనుకుంటున్నట్టు సంబంధిత అధికారులు తెలిపినట్టుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై వార్షిక అంతర్గత సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోనుందని వెల్లడించింది.

2018- 2019 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీరేటు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ వడ్డీరేటు పెంచడం వలన, 6 కోట్ల మంది ఖాతాదారులకు లాభం చేకూరుతుంది. ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ విషయంపై ఈ నెలాఖరుకి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.  

More Telugu News