kcr: కేసీఆర్ ‘ఫ్రంట్’పై అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • కేసీఆర్ ‘ఫ్రంట్’ గురించి నాకు తెలియదు
  • తెలంగాణపై చంద్రబాబు ద్వేషంతో ఉన్నారు 
  • అందుకే, కూటమి కట్టి కంగుతిన్నారు

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించడం, ఈ క్రమంలో ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీలో ఇటీవల ఆయన పర్యటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ‘ఫ్రంట్’ ఏర్పాటు విషయమై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు.

ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ, కేసీఆర్ ‘ఫ్రంట్’ ఏర్పాటు చేస్తున్నారన్న విషయం తనకు తెలియదని చెప్పారు. మోదీ కోసమే కేసీఆర్ ఈ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు చేసిన విమర్శలపై  ప్రశ్నించగా.. తెలంగాణపై ద్వేషంతో ఉన్న చంద్రబాబు రాజకీయాలు చేయాలనుకుని, అక్కడి ఎన్నికల్లో కూటమి కట్టి కంగుతిన్నారని, అందువల్లే, చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. 

More Telugu News