మాయావతి ఒత్తిడికి లొంగిన కాంగ్రెస్.. కేసుల ఉపసంహరణకు నిర్ణయం
- భారత్ బంద్ సందర్భంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలన్న మాయావతి
- లేని పక్షంలో మద్దతుపై పునరాలోచిస్తామంటూ హెచ్చరిక
- కేసులను ఉపసంహరించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుముఖత
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తున్నారనే ఆరోపణలతో ఏప్రిల్ 2న భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, కేసులను ఎత్తివేయాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి కోరారు. కేసులు ఎత్తివేయని పక్షంలో మద్దతు కొనసాగింపుపై పునరాలోచిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, కేసులను ఎత్తివేసేందుకు కమల్ నాథ్ సర్కారు సిద్ధమైంది.