New Home: కొత్త ఇల్లు కొనాలని అనుకుంటున్నారా?... కేంద్రం నుంచి మీకో శుభవార్త!

  • గృహ రుణంపై రూ. 2.5 లక్షల సబ్సిడీ
  • మార్చి 2020 వరకూ పొడిగింపు
  • వెల్లడించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్

తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. రూ. 6 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకూ సంవత్సర ఆదాయం ఉన్నవారికి గృహరుణంపై రూ. 2.5 లక్షల సబ్సిడీని అందిస్తున్న పథకాన్ని మార్చి 2020 వరకూ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలిపిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్, ఈ స్కీమ్ కింద ఇప్పటివరకూ 93 వేల మంది లబ్దిని పొందారని అన్నారు. సబ్సిడీ కింద కేంద్రం రూ. 1,960 కోట్లను అందించిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లును అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News