: శ్రీనివాసుని సన్నిధిలో మూడువేల పెళ్లిళ్లు!

తిరుమల కొండ పెళ్లి కళతో కళకళలాడుతోంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉండడంతో తిరుమల శ్రీవారి సన్నిధిలో మూడువేలకు పైగా జంటలు ఒకటి కాబోతున్నాయిఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

ఆ మూడు రోజులు కొండపైకి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండపాలను ముస్తాబు చేయడం, వసతి గదుల కేటాయింపు, మంచినీటికి ఎద్దడి లేకుండా చూడడం... వంటి సౌకర్యాలను సమకూరుస్తున్నారు.  

More Telugu News