sankalp reddy: నన్ను ఎవరూ తక్కువగా చూడలేదు: దర్శకుడు సంకల్ప్ రెడ్డి

  • 'ఘాజీ'కి మంచి టీమ్ పనిచేసింది 
  • సెట్లోనే ఎక్కువ భాగం షూటింగ్ 
  • ఎవరూ అలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదు

దర్శకుడు సంకల్ప్ రెడ్డి చాలా సింపుల్ గా కనిపిస్తాడు. చాలా తక్కువ బడ్జెట్ లో భారీగా అనిపించే సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత. అలాంటి సంకల్ప్ రెడ్డి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. "మీ ఫస్టు సినిమా 'ఘాజీ' కదా .. ఆ సినిమా షూటింగు సమయంలో ఆర్టిస్టులుగానీ .. టెక్నీషియన్లుగానీ మిమ్మల్ని తక్కువగా చూశారా?. మీరొక కొత్త డైరెక్టర్ కాబట్టి, 'ఏం తీస్తున్నాడురా ఈయన' అన్నట్టుగా అసహనానికి లోనైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?" అనే ప్రశ్న సంకల్ప్ రెడ్డికి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. 'ఘాజీ' సినిమాకి మంచి టెక్నీషియన్లు పనిచేశారు .. మంచి నటీనటులు వున్నారు. ఈ సినిమా సెట్ లో ఉదయం నుంచి రాత్రి వరకూ షూటింగ్ చేసేవాళ్లం. ఎప్పుడు ఎవరూ కూడా 'ఇదేం పిచ్చి సినిమా' అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదు .. నన్ను ఎవరూ తక్కువగా చూడలేదు. నేను ఏం చేయాలనే క్లారిటీ నాకు ఉండటమే అందుకు కారణం' అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News