Telangana: నీ బిడ్డకు తండ్రిని నేనే అని నిరూపించు.. అప్పుడే పెళ్లి చేసుకుంటా!: ప్రియురాలికి యువకుడి షాక్

  • తెలంగాణలోని జయశంకర్ జిల్లాలో ఘటన
  • కోరిక తీర్చుకుని ముఖం చాటేసిన ప్రియుడు
  • ఇంటి ముందు బైఠాయించిన యువతి

ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు. జీవితాంతం తోడుగా ఉంటానని మాయమాటలు చెప్పాడు. దీంతో యువతి అతడిని ప్రేమించింది. అయితే కోరిక తీర్చుకున్న అనంతరం ఆమెను పెళ్లి చేసుకునేది లేదని సదరు ప్రబుద్ధుడు కరాఖండిగా చెప్పేశాడు. ఈ చర్యతో షాక్ కు గురైన బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన విజయ్ కుమార్, అదే గ్రామానికి చెందిన నాగమణి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగమణిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన విజయ్ కుమార్ ఆమెను లొంగదీసుకున్నాడు. దీంతో నాగమణి గర్భం దాల్చింది. ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకోవాలని నాగమణి కోరగా, విజయ్ కుమార్ అందుకు నిరాకరించాడు. అయితే పెద్దమనుషుల పంచాయితీ పెట్టడంతో పెళ్లికి అతను ఒప్పుకున్నాడు.

అంతలోనే నాగమణి గర్భం దాల్చడానికి, తనకు సంబంధం లేదని విజయ్ కుమార్ బుకాయించాడు. బిడ్డకు డీఎన్ ఏ పరీక్షలు చేసి తనకే పుట్టాడని నిర్ధారణ అయితేనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో బాధితురాలు విజయ్ కుమార్ ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. అక్కడే బైఠాయించింది.

ఈ నేపథ్యంలో విజయ్ తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకుని ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని సూచించారు. దీంతో తన కష్టాలను పోలీసులకు చెప్పుకున్న బాధితురాలు భోరుమని ఏడ్చింది. తనకు న్యాయం చేయాలని కోరింది.

More Telugu News