Telangana: కేటీఆర్ జీ.. కుంభమేళాకు రండి.. స్వయంగా ఆహ్వానించిన యూపీ ప్రభుత్వం!

  • ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో కుంభమేళా
  • కేటీఆర్ ను కలుసుకున్న యూపీ మంత్రి సతీశ్
  • సానుకూలంగా స్పందించిన టీఆర్ఎస్ నేత

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో 2019 జనవరి 15 నుంచి మార్చి 4 వరకూ జరగనున్న కుంభమేళాకు రావాల్సిందిగా కేటీఆర్ ను యూపీ ప్రభుత్వం కోరింది.

ఈరోజు కేటీఆర్ ను కలుసుకున్న యూపీ మౌలికవసతులు, పరిశ్రమల మంత్రి సతీశ్ మహానా కుంభమేళాకు రావాల్సిందిగా స్వయంగా వచ్చి ఆహ్వానించారు. కాగా, ఈ విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

More Telugu News