హైదరాబాద్లో ఉగ్ర కలకలం.. పాక్ ఉగ్రవాదులతో మాట్లాడుతున్న దినేశ్ అరెస్ట్
- నల్లకుంట కేంద్రంగా సైన్యం కదలికలపై ఆరా
- అనుమానించిన అధికారులు
- రెండు రోజుల నిఘా అనంతరం నిందితుడి పట్టివేత
జమ్ముకశ్మీర్లోని భారత సైన్యం కదలికలు తెలుసుకునేందుకు పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు పన్నాగం పన్నినట్టు భారత నిఘా విభాగం గుర్తించింది. ఈ ఫోన్ వ్యవస్థ ద్వారా, సైన్యంలో ఉన్నతాధికారులమని చెబుతూ సైనికాధికారుల రహస్య సమాచారాన్ని ఐఎస్ఐ ఏజంట్లు అడుగుతుండడంతో అనుమానం రావడంతో ఇద్దరు అధికారులు ఈ విషయాన్ని సైన్యంలోని నిఘా విభాగానికి చేరవేశారు. ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీయగా హైదరాబాద్లోని ఓ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ నుంచి వస్తున్నట్టు గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), తెలంగాణ పోలీసులు రెండు రోజులు నిఘా పెట్టి నల్లకుంట టీఆర్టీ కాలనీలో నివసిస్తున్న దినేశ్ను అరెస్ట్ చేశారు.