adivi shesh: స్పానిష్ మూవీ రీమేక్ లో అడవి శేష్

  • 'టూ స్టేట్స్' రీమేక్ లో బిజీ 
  • 'గూఢచారి 2'కి సన్నాహాలు 
  • సెట్స్ పై క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ      

'క్షణం'.. 'గూఢచారి' వంటి సినిమాలతో అడవి శేష్ కథానాయకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రస్తుతం 'టూ స్టేట్స్' రీమేక్ లో చేస్తోన్న ఆయన, ఆ తరువాత 'గూఢచారి 2' చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ రెండు సినిమాల మధ్య ఆయన మరో ప్రాజెక్టు చేస్తున్నాడనేది తాజా సమాచారం.

ఒక స్పానిష్ సినిమా రీమేక్ లో ఆయన నటిస్తున్నాడట. 'ది ఇన్విజిబుల్ గెస్ట్' అనే క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ లో ఆయన కథానాయకుడిగా చేస్తున్నాడు. రాంజీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అడవి శేష్ సరసన కథానాయికగా లావణ్య త్రిపాఠి చేస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగును పూర్తి చేసినట్టుగా సమాచారం. మాజీ ప్రియురాలి హత్యకేసులో నిందితుడైన బిజినెస్ మేన్ గా ఇందులో అడవి శేష్ కనిపిస్తాడని అంటున్నారు. పీవీపీ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

More Telugu News