anakapalli: అనకాపల్లి శిల్పి ఘనత.. బెల్లపు దిమ్మెతో ఎన్టీఆర్ విగ్రహం

  • 20 కిలోల బెల్లపు దిమ్మెను ఉపయోగించా
  • ఈ విగ్రహాన్ని రూపొందించేందుకు 24 గంటలు పట్టింది
  • శిల్పి కామధేను ప్రసాద్

ఈరోజు అనకాపల్లికి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి బహుమతిగా ఎన్టీఆర్ అరుదైన  విగ్రహాన్ని శిల్పి కామధేను ప్రసాద్ అందజేయనున్నారు. ఈ సందర్భంగా కామధేను ప్రసాద్ మాట్లాడుతూ, ఇరవై కిలోల బరువున్న బెల్లపు దిమ్మెతో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని రూపొందించానని, ఇందుకు ఇరవైనాలుగు గంటల సమయం పట్టిందని చెప్పారు. ఈ విగ్రహాన్ని చంద్రబాబుకు బహూకరించనున్నట్టు కామధేను ప్రసాద్ తెలిపారు. 

More Telugu News