Telangana: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక.. తొలిసారి పార్టీ శ్రేణులకు కేటీఆర్ ఆదేశాలు!

  • ఓటర్ల నమోదుకు చొరవ తీసుకోవాలని పిలుపు
  • జనవరి 25వరకూ కార్యక్రమం సాగుతుందని వెల్లడి
  • ట్విట్టర్ లో వివరాలను పంచుకున్న కేటీఆర్

తెలంగాణలో ఓటరు నమోదు కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతీ ఊరిలో ఓటరు జాబితా ఆధారంగా ముందుకు సాగాలనీ, ప్రజలు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చొరవ తీసుకోవాలని సూచించారు.

2019, జనవరి 25 వరకూ ఈ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. పార్టీ నాయకులతో సమీక్షా సమావేశంలో ఈ మేరకు శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు.

More Telugu News