Pushpaleela: స్కూల్ ప్రిన్సిపాల్‌ కు వివాహేతర సంబంధాలు.. కేసు పెట్టిన భార్య!

  • 24 ఏళ్ల క్రితం పుష్పలీలతో వివాహం
  • 2009లో సరితతో పెళ్లి
  • మానస, మంజుల అనే మహిళలతో వివాహేతర సంబంధం

హైదరాబాద్‌లోని రామాంతపూర్ పారిజాత స్కూల్ ప్రిన్సిపాల్‌పై ఆయన భార్య వేధింపుల కేసు నమోదు చేసింది. ప్రిన్సిపాల్ అనంత రామన్‌గౌడ్‌తో పుష్పలీలకు 24 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే రామన్ గౌడ్.. 2009లో నల్గొండకు చెందిన సరితను వివాహం చేసుకుని వదిలేసి.. 2015లో మానస అనే స్కూలు టీచర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పుష్పలీల ఆరోపించారు. అంతేకాకుండా ఈ మధ్య మంజుల అనే యువతితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని... అదేమని ప్రశ్నించిన తనను వేధిస్తున్నాడని.. అందుకే తాను పోలీసులను ఆశ్రయించానని పుష్పలీల తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు రామన్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  
`

More Telugu News