లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ.. విపక్షాల ఆందోళన!
- బిల్లు పట్ల కేంద్రం తీరుపై విపక్షాల నిరసన
- సభలో గందరగోళ పరిస్థితులు
- చర్చకు సహకరించాలని కోరిన మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, బిల్లులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని, పలు దేశాలు ఈ ఆచారాన్ని రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, ట్రిపుల్ తలాక్ బిల్లుపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని, దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు.