Himachal Pradesh: మోదీ సభకు వెళుతూ పల్టీలు కొట్టిన బస్సు.. 35 మంది విద్యార్థులకు గాయాలు!

  • హిమాచల్ ప్రదేశ్ లో ఘటన
  • ధర్మశాలకు వెళుతున్న బస్సు
  • కేసు నమోదుచేసిన పోలీసులు

నేడు హిమాచల్ ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సభకు విద్యార్థులను తీసుకెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయ లాంటి  ప్రాంతంలోకి జారిపోయింది. బస్సు బోల్తా కొట్టడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జు అయిందన్నారు. వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పడం కారణంగానే పల్టీలు కొట్టిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News