Chittoor District: విద్యార్థులను నగ్నంగా నిలబెట్టిన 'చైతన్య భారతి'... గుర్తింపు రద్దు!

  • హోమ్ వర్క్ చేయకుండా వచ్చిన విద్యార్థులు
  • ఐదుగురిని స్కూలు బయట నిలబెట్టిన యాజమాన్యం
  • తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత

పాఠశాలకు హోమ్ వర్క్ చేయకుండా వచ్చారన్న కారణంతో కొందరు విద్యార్థులను నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టిందో విద్యాసంస్థ. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు చైతన్య భారతి స్కూలులో జరిగింది. ఐదుగురు విద్యార్థుల బట్టలను ఊడదీయించిన టీచర్లు, వారిని అందరూ చూసేలా స్కూలు బయట నిలబెట్టారు. ఘటనపై వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, విద్యాశాఖ స్పందించింది. నిన్న ఈ ఘటన జరుగగా, నేడు పాఠశాలను సందర్శించి విచారించిన అధికారులు చైతన్య భారతి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. పాఠశాలలోని విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ తెలిపింది.

More Telugu News