West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటి?: మాణిక్యాలరావు సూటి ప్రశ్న

  • ఏపీలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది
  • పశ్చిమగోదావరి జిల్లాకు అన్యాయం చేశారు
  • సీఎం చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలి

ఏపీలో అభివృద్ధిని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారని బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ఏలూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పశ్చిమగోదావరి జిల్లాకు అన్యాయం చేశారని, ఈ జిల్లాకు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ జిల్లాను చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు టీడీపీకి పట్టం కట్టినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు.

More Telugu News